Friday, April 26, 2024

తెలంగాణలో 4,559 కొత్త కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

4559 New Covid Cases Reported in Telangana

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 4,559 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,13,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 4,559 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,43,354కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,450 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 432, రంగారెడ్డి జిల్లాలో 322 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,077కు చేరింది. తాజాగా కరోనా నుంచి 1,961 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,03,008 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.57 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.55 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 36,269 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 7,695 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News