Saturday, April 20, 2024

బాగానే ఉన్నా.. కరోనాకు భయపడవద్దు: మధ్యప్రదేశ్ సిఎం

- Advertisement -
- Advertisement -

భోపాల్: శనివారం తనకు కరోనా నిర్ధారణ అయిందని స్వయంగా వెల్లడించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాను బాగానే ఉన్నానని వైద్య చికిత్స చేయించుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంటూ ఆదివారం వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో అందర్నీ కరోనా గురించి భయపడ వద్దని, కరోనా లక్షణాలు కనిపిస్తే దాచుకోకుండా ఎవరికి వారు స్వయంగా వైద్యచికిత్స చేయించుకుంటే ఆరోగ్యవంతులౌతారని సూచించారు. రాష్ట్రంలోని కరోనా వారియర్ల బృందం అంకిత భావంతో ప్రాణాలకు తెగించి, కరోనా రోగులకు వైద్యం అందిస్తోందని, వారందరికీ కృతజ్ఞతలు వెల్లడించారు. బోపాల్ చిరాయు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన నీలిరంగు ఆస్పత్రి దుస్తుల్లో కనిపించారు. పడకపై కూర్చుని ప్రధాని మన్‌కీబాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.

Don’t fear to Corona says CM Shivraj Singh Chouhan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News