Friday, April 26, 2024

దేశంలో మరో 46,232 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

46232 new covid 19 infections in india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24గంటల్లో 46,232 మందికి కొత్తగా కోవిడ్ సోకగా… మరో 564 మంది మృతి చెందారు. ఇండియాలో మొత్తం కేసులు సంఖ్య 90,50,598కి పెరిగింది. దేశవ్యాప్తంగా 1,32,726 మందిని కరోనా కబలించింది. ప్రస్తుతం భారత్ లో 4,39,747 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 84,78,124 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ ప్ర‌క‌టించింది. భారత్ లో కరోనా రికవరీ రేటు 93.67 శాతం ఉండగా.. మరణాల రేటు 1.47శాతం ఉందని అధికారులు వెల్లడించారు. న‌వంబ‌ర్ 20 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 13,06,57,808 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒకేరోజు 10,66,022 మందికి క‌రోనా టెస్టులు చేసినట్టు ఐసిఎమ్ఆర్ ప్రకటించింది.

46232 new covid 19 infections in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News