- Advertisement -
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9,136 శాంపిళ్లను పరీక్షించగా మరో 47 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 2,561మందికి కరోనా సోకింది. తాజాగా కృష్ణాజిల్లాలో మరొకరు కరోనాకు బలైయ్యారు. దీంతో ఎపిలో మృతుల సంఖ్య మొత్తం 56కి పెరిగింది. ప్రస్తుతం 727మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 1,778 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన 47 కేసుల్లో 5కేసులు కోయంబేడు లింకులేనని ప్రభుత్వం ప్రకటించింది.
47 New Coronavirus Positive cases in AP
- Advertisement -