దేశరాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో ముగ్గురు ఎయిమ్స్ సిబ్బంది కూడా మృతిచెందినట్లు తెలిపారు. సామాన్య ప్రజలతోపాటు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 23వేలు దాటింది. తాజా కేసులతో ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 23,645కి చేరింది. కరోనా వైరస్ తో రాష్ట్రంలో ఇప్పటివరకు 606 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, కరోనా వైరస్ నుంచి 9,542 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 13,497 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
480 Delhi AIIMS Personnel infected with Covid 19