Thursday, April 25, 2024

కేరళలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..

- Advertisement -
- Advertisement -

482 New Corona deaths reports in Kerala

తిరువనంతపురం: కేరళలో మహమ్మారి కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 7,163 మందికి వైరస్​ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కేరళలో 90 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్యను సవరించగా.. 482 మరణాలు నమోదయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు. కొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 49,19,952కు చేరగా.. మరణాల సంఖ్య 29,355కు పెరిగింది.

ఇక, తమిళనాడులో కొత్తగా 1,090 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. వైరస్ కారణంగా మరో 15 మంది మృతి చెందారు. కొత్తగా 1,326 మంది వైరస్​ను జయించారు. ఒడిశాలో కొత్తగా 433 మందికి వైరస్ సోకింది. మరో నలుగురు మరణించారు.

482 New Corona deaths reports in Kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News