Tuesday, April 23, 2024

తెలంగాణలో కొత్తగా 4,826 కేసులు.. 32మంది మృతి

- Advertisement -
- Advertisement -

4826 New Corona Cases Registered in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 4,826 పాజిటివ్ కేసులు, 32 మరణాలు నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. అదే సమయంలో 7,754మంది కరోనా బాధితులు కోలుకున్నారని తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,02,187కి చేరుకుంది. ఇక, వైరస్ కారణంగా ఇప్పటివరకు 2,771మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 65,923 శాంపిళ్లను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,797 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

4826 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News