Friday, April 19, 2024

ఎపిలో 10వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

497 new Corona Cases in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,047 శాంపిళ్లను పరీక్షించగా మరో 497 పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 10,331కి చేరుకున్నాయి. ఇప్పటివరకు 129 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఎపిలో 448, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 37 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి ఎపికి వచ్చిన మరో 12మందికి కోవిడ్-19 వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఎపిలో 5,423 యాక్టివ్ కేసులు 4,779మంది కరోనా తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.

 

497 new Corona Cases in andhra pradesh

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News