Thursday, April 25, 2024

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు వలస కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

Road-Accident

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా… మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మామిడిపండ్ల లోడుతో హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్‌కు ప్రయాణిస్తున్న లారీలో వలస కూలీలు ఎక్కారు. అయితే వేగంగా వెళ్తున్న లారీ నర్సింగ్‌పూర్ జిల్లా పరా దగ్గర అదుపు తప్పి కారుపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

5 dead 11 injured after truck overturns in MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News