- Advertisement -
కర్నాటక: ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం అయ్యారు. బస్సు విజయ్ పుర నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటలు అంటుకుని 27మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్టు తెలుస్తోంది. హిరియూరు తాలుకు కేఆర్ హళ్లి గేటు 4వ జాతీయరహదారిపై ఈ ఘటన చోటకేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.
- Advertisement -