Tuesday, March 19, 2024

బస్సు-ట్రక్కు ఢీ: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Road Accident

 

పాట్నా: బిహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లా షీయోసాగర్ ప్రాంతంలో జాతీయ రహదారి 28పై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రోహతాస్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంకా మృతులు వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు. ఫిబ్రవరి 9న బెగుసారాయి జిల్లా జాతీయ రహదారి 28పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 28 అనేది మృత్యువుకు రహదారిగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.

 

5 people dead in Bus collided Truck in Rohtas Dist
5 people dead, 12 injured in an accident between a truck and a bus on National Highway 2 near Kirihiri in Sheosagar Block of Rohtas district. The injured have been taken to a hospital
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News