Thursday, March 28, 2024

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: కెరన్ సెక్టార్ ఆపరేషన్ లో మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కెరన్ సెక్టార్ నుంచి భారత్ లోకి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రత బలగాలు హతమార్చారు. కాశ్మీర్ లోయలో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులపై శని, ఆదివారాల్లో భద్రత బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన మరో ఇద్దరు సైనికులు కూడా ఆదివారం మరణించారు. ఈ ఆపరేషన్ లో ఐదుగురు సైనికులు అమరులయ్యారని రక్షణ అధికారులు తెలిపారు.

5 Soldiers Martyred during infiltration bid in Keran

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News