- Advertisement -
సిద్దిపేట: ఇండ్లు లేని పేదలు ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని రావురూకల, తోర్నాల గ్రామంలో యాబై మందికి డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందించడమే కాకుండా గృహ ప్రవేశాలు అంగరంగా వైభవంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలని డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నామన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో మాస్కులు లేకుండా ఎవ్వరూ బయట తిరుగొద్దని సూచించారు. కిరాయి ఇళ్లు, గుడిసె తప్ప తమకు ఇల్లు లేదని మాకు దేవుడిలా డబుల్ బెడ్ రూమ్లు ఇచ్చిన సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పది కాలాలపాటు వారు చల్లగా ఉండాలని దీవెనలు అందించారు.
- Advertisement -