Friday, March 29, 2024

ఎపిలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,980కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 925మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… 45మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో కొత్తగా 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో అనంతపురం-5, గుంటూరు-6, కడప-1, కృష్ణా-1, నెల్లూరు-5, కర్నూలు-13, ప్రకాశం-2, విశాఖపట్నం-1 కేసు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.

 

 

AP-Corona

50 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News