- Advertisement -
నర్సింహులపేట: మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో శుక్రవారం అభివృద్ధి పనులలో భాగంగా నర్సరీ పనుల పరిశీలనకు వచ్చిన జిల్లా పంచాయతీ అధికారిని ఆశాలత మాస్క్ లేకుండా పాల్గొన్న ప్రజా ప్రతినిధిపై అగ్రహం వ్యక్తచేశారు. మాస్క్ లేకుండా వచ్చిన ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణకు 500 పైన్ విధించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశంచడంతో తక్షణమే పైన్ విధించి రశీదు ఇచ్చారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ… గ్రామాలలో ప్రజాప్రతినిధులే మాస్క్లు ధరించకుంటే ఎలా అని ప్రశ్నించింది. గ్రామాలలో ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని లేని పక్షంలో పైన్ విధించడం జరుగుతుందని దండోరా వేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆధేశించారు.
500 fine for Deputy Sarpanch not wearing mask
- Advertisement -