Thursday, March 28, 2024

చిన్న పిల్లల కోసం 5000 బెడ్స్ సిద్ధం: హరీష్ రావు

- Advertisement -
5000 beds ready for children
హైదరాబాద్: హైసియా, నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయమని మంత్రి హరీష్ రావు తెలిపారు. నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసియు వార్డును ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తుందని, సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కొనియాడారు.
రాబోయే రోజుల్లో 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని, కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామని, దీని కోసం సిఎం రూ.133 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా నిలోఫర్ లో మరో 25 ఐసియు పడకలను 1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.
హైసియా, నిర్మాన్ సంయుక్తంగా సెకండ్ వేవ్ తరువాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతనికి 18 కోట్లు నిధులు అందించారన్నారు. రూ. 1.10 కోట్లతో ఓపెన్ టెక్ట్స్ నుంచి నిలోఫర్ లో ఐసియు అప్ గ్రేడ్ చేయడం గొప్ప విషయమని హరీష్ రావు ప్రశంసించారు.  మొదటి కార్యక్రమంలో నిలోఫర్ ఆసుపత్రిలో పాల్గొనటం సంతోషంగా ఉందని, ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని సిఎం కీలక నిర్ణయమన్నారు. రు.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు.  ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలని, కెసిఆర్ కిట్ వచ్చాక గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్ ని 50 శాతానికి పెంచామన్నారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, ఎన్ఎంఆర్ మరణాలు గణనీయంగా తగ్గాయని, నగరం 4 వైపులా నాలుగు మెడికల్ టవర్ లు తీసుకురావాలని కృషి చేస్తున్నామన్నారు.
వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటిలోకి తీసుకొస్తామని, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజి ఉండాలని సంకల్పం తీసుకున్నామని, రూ.33 కోట్లతో నీలొఫర్ లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. మూడో వేవ్ వస్తే సన్నద్ధంగా వుండేడుకు రు. 133 కోట్లు కేటాయించామని, 5000 బెడ్స్ ని చిన్న పిల్లల కోసం సిద్ధంగా ఉంచామని హరీష్ రావు  తెలియజేశారు. దేశ సగటు కంటే తెలంగాణ వాక్సినేషన్ లో ముందే ఉందని, వైద్యులు మరింత సమయం కేటాయించాలని, కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీ పడి మంచి వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. వైద్యులు, సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం చూసుకుంటుందని, అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం జిల్లా ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్ ను నిలోఫర్ ఆసుపత్రి లో ప్రారంభించారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News