Friday, March 29, 2024

సైబరాబాద్‌లో 503మంది మందుబాబులను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

503 jailed for drunk driving in Cyberabad

హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న మందుబాబులను సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా వారిలో 56 మందికి జైలు శిక్ష విధించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, అల్వాల్, జీడిమెట్ల, రాజేంద్రనగర్, షాద్‌నగర్, శంషాబాద్‌లో గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 4వ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. బాలానగర్‌లో 55మంది, గచ్చిబౌలిలో 69,కూకట్‌పల్లి 63, మాదాపూర్ 63, మియాపూర్ 67, అల్వాల్ 23, జీడిమెట్ల 31, షాద్‌నగర్ 12, శంషాబాద్ 3మంది పట్టుబడ్డారు. వారిపై కేసున మోదు చేసి కోర్టులో హాజరుపర్చాగా వారిపై కోర్టు రూ.16,72,100 జరిమానా విధించింది. ఇందులో 20మందికి ఒకరోజు, ఇద్దరికి 24 రోజులు, ఐదుగురికి మూడు రోజులు, ఐదుగురికి నాలుగు రోజులు, ఇద్దరికి ఐదు రోజులు జరిమానా విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News