- Advertisement -
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది 52 లక్షల మొక్కలు నాటాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండలో హరితహారం కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. వివిధ నర్సరీల్లో 65.92 లక్షలు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ రాజయ్య, కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు.
- Advertisement -