Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా 53,601 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

53601 Covid 19 cases and 871 deaths reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదైతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 53,601 కొత్త కోవిడ్-19 కేసులు, 871 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్9 కేసుల సంఖ్య 22,68,676కు పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,39,929 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు ఈ మహమ్మారితో 15,83,490 మంది బాధితులు నయమై కోలుకున్నారు. దేశంలో 45,257 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, గడిచిన 24గంటల్లో 47,746 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. అయితే, సోమవారం వరకు మొత్తం 2,45,83,558 కోవిడ్ టెస్టులు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధన మండలి) పేర్కొంది. 24 గంటల్లో 4,77,023  శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తాజాగా ప్రకటించింది.

53601 Covid 19 cases and 871 deaths reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News