Tuesday, April 23, 2024

ఎపిలో కొత్తగా మరో 54 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

corona

అమరావతి: ఎపిలో కరోనా కేసులు మరిన్ని పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 9,858 శాంపిళ్లను పరీక్షించగా మరో 54 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. గురువారం 45 మంది కరోనా బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని తెలిపింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 2,841కు పెరిగింది. ఎపిలో ప్రస్తుతం 824 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,958 మంది కోవిడ్ బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలులో కొవిడ్‌-19తో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎపి మృతుల సంఖ్య మొత్తం 59కి చేరింది.

54 New Corona Positive Cases in Andhra Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News