- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 54,044 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 717 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 76,51,108కు పెరిగాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,914 మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. ఇండియాలో 67,95,103 మంది కరోనాతో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం 7,40,090 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, అక్టోబర్ 20 వరకు మొత్తం 9,72,00,379 నమూనాలను పరీక్షించగా, వీటిలో నిన్న 10,83,608 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది.
54044 new covid 19 cases reported in india
- Advertisement -