అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 66,121వేల మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 5,487 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 37మంది బాధితులు మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 6,81,121కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,745మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 63,116మంది కరోనా బాధితులు రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,210మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి మొత్తం 6,12,300మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు 56,66,323మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
5487 New Corona Cases Registere