- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 56,282 కొత్త కోవిడ్-19 కేసులు, 904 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 19,64,537కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 5,95,501 యాక్టివ్ కేసులుండగా.. 13,28,337 కరోనా బాధితులు నయమై కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటివరకు 40,699 కరోనాతో మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. భారత్ లో ఇప్పటివరకు 2.21కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించగా.. గత 24గంటల్లో 6.64లక్షల కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎమ్ఆర్ పేర్కొంది.
56282 new covid 19 cases and 904 deaths in india
- Advertisement -