Friday, April 19, 2024

ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా

- Advertisement -
- Advertisement -

57 New Covid 19 cases in Andhra Pradesh

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇందులో ఎపి రాష్ట్రానికి చెందిన వారు 57 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 45మంది ఉన్నారు.

మహారాష్ట్ర 34, రాజస్థాన్ 11 మందికి కరోనా బారినపడినట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనంతపురం-4, చిత్తూరు-14, తూర్పుగోదావరి-1, కడప-2, కృష్ణా-9, కర్నూలు-8, నెల్లూరు-14, విశాఖపట్నం-2, విజయనగరం-3, కేసులు బయటపడ్డాయని ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఎపిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  2,157కి చేరింది. ఎపిలో ప్రస్తుతం 857 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కోవిడ్-19 రాకాసితో కోలుకుని 1,252 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య 48గా ఉంది.

AP-Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News