Wednesday, April 24, 2024

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

 57117 Covid 19 cases and 764 deaths in India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 57,117 పాజిటివ్ కేసులు, 764 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 16,95,988కి చేరుకున్నాయి. వీటిలో 5,65,103 యాక్టివ్ కేసులు, 10,94,374 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి నయమై డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో ఇప్పటివరకు 36,511 మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది. ఇండియాలో కొత్తగా 36,569 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. భారత్ లో ఇప్పటివరకు 1.93కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించగా.. గత 24గంటల్లో 5.25 లక్షల కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. అటు మహారాష్ట్రలో ఎక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 4,22,118మందికి కోవిడ్ సోకగా… 14,994 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 2,56,158 మంది కరోనా బాధితులు కోలుకోగా… 1,50,966 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

57117 Covid 19 cases and 764 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News