Saturday, April 20, 2024

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

నల్గొండ: జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం స్టేజి వద్ద ఓ కారును వెనుక నుంచి ట్రాన్స్పోర్ట్ డీసీఎం ఢీకొట్టింది. దీంతో వరద కాలువలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జ అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించగా.. ఒకరి పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరంతా హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలుకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం హైవేపై ఆగి ఉన్న ట్రాఫిక్ ని క్లియర్ చేస్తుండగా మరొక లారీ వచ్చి మరో కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు.

6 dead in Road Accident in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News