Thursday, April 25, 2024

కేరళలో భారీ వర్షాలు.. ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

6 deaths due to heavy rains in Kerala

తిరువనంతపురం (కేరళ) : కేరళలో భారీ వర్షాలు, వరదలతో వాతావరణ శాఖ 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లపుజా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు , వరదల వల్ల ఆరుగురు మరణించగా, అనేక ఇళ్లు వరద నీటికి కొట్టుకు పోయాయి. సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్దంగా ఉండాలని కేరళ సిఎం పినరయి విజయన్ ఆదేశించారు. వరద నీటిని 17 డ్యామ్‌ల ద్వారా కిందకు విడుదల చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News