Wednesday, April 24, 2024

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలరించనున్న ఆరు భారతీయ చిత్రాలు

- Advertisement -
- Advertisement -

Indian Movies to Canns

చెన్నై:   ఈ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దేశ సంస్కృతి యొక్క అనేక రంగులతో కూడిన విభిన్న కథలను వివరించే భారతదేశం నుండి ఆరు సినిమాలు ప్రదర్శించబడనున్నాయి. మే 17న ప్రారంభమయ్యే 10 రోజుల ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడే ఆరు చిత్రాలను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది.

వాటిలో ఆర్. మాధవన్ ‘రాకెట్‌రీ – ది నంబి ఎఫెక్ట్’ (హిందీ, ఇంగ్లీష్, తమిళం), ‘గోదావరి’ (మరాఠీ), ‘ఆల్ఫా బీటా గామా’ (హిందీ), ‘బూంబా రైడ్’ (మిషింగ్), ‘ధుయిన్’ (హిందీ, మరాఠీ) మరియు ‘ట్రీ ఫుల్ ఆఫ్ ప్యారట్స్’ (మలయాళం) ఉన్నాయి.

‘‘నేను చాలా ఎక్సైటెడ్ గా, నర్వస్ గా ఉన్నాను. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు నా చిత్రం వెళుతుంటే ఆ భావనలున్నాయి. అందునా నేను తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం అక్కడ ప్రదర్శించబడబోతోంది. ఈ నేపథ్యంలో ఎలా ఫీలవ్వాలో కూడా తెలియడం లేదు. నా కడుపులో సుళ్లు తిరుగుతున్నట్లుగా ఉన్న పరిస్థితి నాది’’ అని నటుడు, దర్శకుడు మాధవన్ అన్నారు.

దర్శకుడు నిఖిల్ మహాజన్, తన చిత్రం ‘గోదావరి’ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ఈ చిత్రం  గోదావరి నది ఒడ్డున జీవిస్తున్న ఒక కుటుంబం మరణాన్ని తట్టుకునే కథను వివరిస్తుంది.

అచల్ మిశ్రా యొక్క ‘ధుయిన్’ వర్ధమాన నటుడి కథతో కలలు మరియు బాధ్యతల మధ్య గొడవను తెరుస్తుంది, అయితే శంకర్ శ్రీకుమార్ యొక్క ‘ఆల్ఫా బీటా గామా’ ఒక వివాహాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ‘బూంబా రైడ్’ దర్శకుడు బిస్వజీత్ బోరా ఇది  ప్రాంతీయ సినిమాకు కొత్త ప్రారంభం అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News