Friday, March 29, 2024

ఆరావళిలో కారు బీభత్సం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

6 Killed As Car Runs Over Pilgrims In Gujarat

ఆరావళి: గుజరాత్‌లోని ఆరావళి జిల్లా మల్పూర్ ప్రాంతంలో శుక్రవారం యాత్రికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. బాధితులు సమీపంలోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ తన వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో మోదాసా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సానుభూతి తెలిపారు. మరణించిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు. గాయపడిన మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరావళి జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News