Thursday, April 25, 2024

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

6 killed in road accident in Uttar Pradesh

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వారణాసి-జౌన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కు-వాహనం డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే ఆ ప్రాంతంలోని స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారణాసి నుంచి తిరిగి వస్తున్న సమయంలో వాహనం ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

6 killed in road accident in Uttar Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News