- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇందులో నలుగురు మహిళ నక్సలైట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం తరలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
6 Maoists killed in Encounter in Kothagudem
- Advertisement -