Tuesday, April 23, 2024

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కేంద్రం అలర్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం 6.050 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. వైరస్ కారణంగా భారత్ లో మరో 14 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది. దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,41,85,858కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా, వారంవారీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత రోజు మొత్తం 1,78,533 పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 92.25 కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో మొత్తం 2,334 డోస్‌ల వ్యాక్సిన్‌లను అందించారు. ఇప్పటి వరకు, జనవరి 16,2021న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 2,20,66,20,700 వ్యాక్సిన్‌లు టీకాలు వేయబడ్డాయి. యాక్టివ్ కేసులతో కేరళలో అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 265 కొత్త కేసులతో, ఢిల్లీలో 2,060 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో మొత్తం 3,987 యాక్టివ్ కేసులు బయటపడ్డాయి. కోవిడ్ కేసుల వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది.

పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ రోజు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ప్రధాని మోడీ కూడా అన్ని రాష్ట్రాలతో పరిస్థితిని సమీక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News