- Advertisement -
హైదరాబాద్: వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన 814 మందిని గుర్తించామని, పరీక్షలు నిర్వహించామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు. కరోనా పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 615 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తదని ఎర్రబెల్లి, సత్యవతి స్పష్టం చేశారు.
615 bed Isolation ward ready in warangal district
- Advertisement -