న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు 20లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో 61,537 కోవిడ్-19 కొత్త కేసులు, 933 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,88,612 కు పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,19,088 యాక్టివ్ కేసులుండగా… ఇప్పటివరకు 14,27,006 నయమై కోలుకున్నారు. ఇండియాలో 42,518 మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో ఆగస్టు 7తేదీ వరకు పరీక్షించిన కోవిడ్ నమూనాల సంఖ్య 2,33,87,171ఉండగా, ఇందులో శుక్రవారం 5,98,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) ప్రకటించింది. అటు మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు ఐదు లక్షలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,90,262 మందికి ఈ వైరస్ సోకింది. ప్రస్తుతం 1,45,582 యాక్టివ్ కేసులున్నాయి. 3,27,281 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా… 17,092 మందిని కరోనా కబలించింది.
61537 cases and 933 deaths reported in India