- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 62,064 కొత్త కోవిడ్-19 కేసులు, 1,007 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075కి పెరిగాయి. దేశవ్యాప్తంగా 6,34,945 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 15,35,744 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని నయమైయ్యారు. ఇప్పటివరకు దేశంలో 44,386 మంది కోవిడ్ తో మరణించినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆగస్టు 9 వరకు 2,45,83,558 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. గడిచిన 24గంటల్లో 4,77,023 మందికి టెస్టులు చేసినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎమ్ఆర్) పేర్కొంది.
62064 Covid 19 cases and 1007 deaths reported in India
- Advertisement -