- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 64,399 కొత్త కోవిడ్-19 కేసులు, 861 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,011కు చేరుకుంది. ఇండియాలో ప్రస్తుతం 6,28,747 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా 14,80,885 మంది బాధితులు కరోనా మహమ్మారి నంచి కోలుకుని నయమైయ్యారు. కోవిడ్ తో 43,379 మంది మరణించినట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. శనివారం వరకు మొత్తం 2,41,06,535 మందకి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసిఎంఆర్ పేర్కొంది. గత 24 గంటల్లో 7,19,364 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.
64399 cases and 861 deaths reported in India
- Advertisement -