Thursday, April 25, 2024

దేశంలో 25లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

65002 Covid 19 cases and 996 deaths reported in India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 65,002 కొత్త కోవిడ్-19 కేసులు, 996 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 25,26,193కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 6,68,220 యాక్టివ్ కేసులుండగా… 18,08,937 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 49,036 మందిని కోవిడ్ కబలించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. శుక్రవారం వరకు ఇండియాలో మొత్తం 2,85,63,095 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 8,68,679మందికి టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News