Thursday, April 25, 2024

రోడ్డు విస్తరణకు రూ.66 కోట్లు 

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ గుడి నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరణ రూ.66 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూర్ వరకూ 10 కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిత్యం ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రజా సౌకర్యార్థం రహదారి విస్తరణ చేపడుతున్నామని తెలిపారు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూర్ వరకూ నాలుగు లైన్ల రహదారి, బట్టర్ ఫ్లై లైట్స్ తో అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సిద్దిపేట చుట్టూ నలు వైపులా నాలుగు లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయని , బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం కెసిఆర్ సిఎం అయ్యాక ఇవన్నీ జరుగుతున్నాయని పేర్కొన్నారు. రంగనాయక సాగర్ నుండి నీరు వదలాలని రైతుల కోరిక మేరకు నేడు నీరు వదులుతున్నామని సూచించారు. కాంగ్రెస్, బీజేపి నాయకులు కాళేశ్వరం నీళ్లతో ఎకరం భూమి పారలేదని ఆరోపిస్తున్నారని విమర్శించారు.

రైతుల పంట పొలాల్లో నీరు పారుతుంటే వారికి కండ్లు ఉండి చూడలేకపోతున్నారని ప్రతిపక్ష పార్టీల తీరుపై విమర్శలు చేశారు. కాళేశ్వరం ఫలితం ఏమిటో మా గ్రామాలకు వచ్చి పారే నీళ్లను చూస్తే తెలుస్తుందని ప్రతిపక్షాల నాయకులకు మంత్రి సూచించారు. సిఎం కెసిఆర్ రైతుల పంటలకు నీళ్ళు అందించాలని మాకు అవకాశం ఇచ్చారు చివరి రైతు వరకూ నీరు అందించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News