Saturday, April 20, 2024

దేశంలో కొత్తగా మరో 6,654 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్ లో 6,654 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 137 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,25,101కి పెరిగాయి. ఇందులో 69,597 మంది బాధితులు దేశంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్ లో 51,784 మంది కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో మొత్తం 3,720 మంది ప్రాణాలు కోల్పోయారు.

అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచంలో కరోనా కేసులు 53.04 లక్షలకు చేరాయి. ఇప్పటివరకు 3.40లక్షలకు పైగా కరోనా బాధితులు మరణించారు. దేశంలోని తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. మహరాష్ట్రలో కొత్తగా 2,940 పాజిటివ్ కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో కొత్తగా 1,751 కొత్తకేసులు, 27మంది ప్రాణాలు విడిచారు. తమిళనాడులో కోవిడ్ కేసుల సంఖ్య 14,753కి చేరాయి.

6654 New Covid 19 Cases and 137 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News