Friday, April 19, 2024

దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 6,767 పాజిటీవ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Corona Cases

 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొదట్లో వందలల్లో కేసులు నమోదు కాగా, ఇప్పడు వేలల్లో కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,767 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, మరో 147 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కు చేరింది. ఇందులో కరోనా నుంచి 54,441 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 73,560 మంది దేశంలోని వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 3,867 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న కూడా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 6,654 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

6676 New Corona Cases Reported in last 24 hrs in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News