- Advertisement -
న్యూఢిల్లీ:దేశంలో ఆహారధాన్యాల కోరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ అన్నారు. ఆహార వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దేశంలో మొత్తం 4,067 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని.. ఇప్పటివరకు కరోనాతో 109 మంది చనిపోయారని చెప్పారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారన్నారు. మర్కజ్ సంబంధిత కేసులు మొత్తం 1445 అని తెలిపారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 693 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 290 మంది కోలుకున్నారని లవ్ అగర్వాల్ వివరించారు.
693 new corona cases with in 24 hrs in India
- Advertisement -