Wednesday, April 24, 2024

కరోనా కొత్త కేసులు 7 వేలు.. 25 మరణాలు

- Advertisement -
- Advertisement -

7219 new covid cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో తాజాగా 7 వేల మందికి కరోనా వైరస్ సోకిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శుక్రవారం 3.64 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 7219 మంది వైరస్ బారిన పడ్డారు. పాజిటివిటీ రేటు 1.98 శాతంగా నమోదైంది. ముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు కొద్దిమేర పెరిగాయి. క్రియాశీల కేసులు 56,745కి తగ్గాయి. ప్రస్తుతం ఆ కేసుల రేటు 0.13 శాతానికి తగ్గింది. శుక్రవారం 9651 మంది కోలుకున్నారు. 25 మంది మరణించారు. ఇప్పటివరకు 4.44 కోట్ల మందికి కరోనా సోకగా, 5.27 లక్షల మంది మృతి చెందారు. 4.38 కోట్ల (98.68శాతం) మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటివరకు 213 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. అందులో నిన్న 25.83 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News