Friday, April 19, 2024

ఎపిలో కొత్తగా 73 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

73 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో గడిచిన 24గంటల వ్యవధిలో 33,980 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 82 మంది కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,423కి పెరిగాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 7,159 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా 8.8 లక్షల మంది పైగా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,003 యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షలు కోటీ 33లక్షలు దాటాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు, చిత్తూరు జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 12 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఎపి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

 

73 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News