Thursday, April 25, 2024

కరోనాను జయించి 45 రోజుల తరువాత 75 ఏళ్ల వృద్ధుడు మృతి

- Advertisement -
- Advertisement -

T cells play a vital role in controlling Coronavirus

 

హైదరాబాద్: కరోనా నుంచి 45 రోజుల తరువాత 75 ఏళ్ల వృద్ధుడు మనోవేదనతో చనిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. అంబోజీ కాలనీలో ఒకే కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. అందరూ హోంక్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటుండగా ఆగస్టు 12న గంటల వ్యవధిలో తల్లీతనయుడు మృత్యువాతపడారు. భార్య, తనయుడు చనిపోవడంతో అప్పటి నుంచి ఆ వృద్ధుడు మనోవేదనకు గురవుతున్నాడు. గత రాత్రి గుండె పోటు రావడంతో ఇంట్లోనే ఆ వృద్ధుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News