- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,665 కొత్త కోవిడ్-19 కేసులు, 80 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరులో 10, పశ్చిమ గోదావరిలో 9 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,116 మంది మరణించారు. ఎపిలో మొత్తం 2లక్షల 35,525 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 87,773 యాక్టివ్ కేసులుండగా… లక్షా 45,636 మంది కోవిడ్ తో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపి వ్యాప్తంగా 25లక్షల 34,304మందికి కరోనా టెస్టులు చేయగా… గత 24గంటల్లో 46,999 మందికి పరీక్షలు చేసినట్టు అధికారులు తెలిపారు.
7665 new Covid 19 cases reported in andhra pradesh
- Advertisement -