- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, దేశంలో కరోనాతో 79 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మర్కజ్ కారణంగా దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెట్టింపయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 472 కేసులు నమోదు కాగా, 11 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,774కు చేరకుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,030 కరోనా యాక్టీవ్ కేసులున్నాయని, కరోనా నుంచి 267 మంది డిశ్చార్జ్ అయ్యారని లవ్ అగర్వాల్ వివరించారు.
79 death in India due to Covid-19: Lav Agarwal
- Advertisement -