Thursday, April 25, 2024

ఎపిలో కొత్తగా 793 కేసులు.. 11మంది మృతి

- Advertisement -
- Advertisement -

269 New Corona Cases Reported in Telangana

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 30,216 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 793 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో 11 మంది బాధితులు మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో ఎపిలో 13,891 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 180మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసుల్లో ఎపికి చెందిన 706 మందికి కరోనా సోకగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 81 మందితోపాటు విదేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటీవ్ వచ్చిది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,479 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనా నుంచి ఇప్పటివరకు 6,232 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో 8,72,076 మందికి కరోనా టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు.

793 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News