Friday, March 29, 2024

దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Corona

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,964 కొత్త కోవిడ్-19 కేసులు, 265 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. ఇందులో 86,422 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 82,370 నయమై కోలుకున్నారు.

4,971 మంది కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అటు మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 62,228 కేసులుండగా… 2098 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26,997 మంది కరోనాతో కోలుకునని డిశ్చార్జ్ కాగా… 33,124 యాక్టివ్ కేసులున్నాయి.

7964 new COVID 19 cases and 265 deaths in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News