Saturday, April 20, 2024

కరెంట్ షాక్ తో 8 పశువులు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: కరెంట్ షాక్ తో ఎనిమిది పశువులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వ్యవసాయం పనుల కోసం పశువులను చనిపోవడంతో రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వస్రాంతండా, లాస్యతండాలోని రైతులు తమ పశువులను తొలుకొని పార్వతమ్మగూడెంలోని ఓ మిరప చేనుకు వెళ్లారు. భారీ గాలులతో వర్షం కురవడంతో విద్యుత్ తీగలు అక్కడ తెగిపడ్డాయి. పశువులు తీగల వద్దకు వెళ్లడంతో కరెంట్ షాక్ తో మృతి చెందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News