- Advertisement -
అహ్మదాబాద్: గుజరాత్ లోని అహ్మదాబాద్ కోవిడ్ ఆస్పత్రిలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన అహ్మదాబాద్ నగరంగపుర కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దవాఖానలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 40మంది కరోనా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఐసియులో చికిత్స పొందుతున్న రోగులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -